ప్రతి గ్రామంలో ‘బాదుడే బాదుడు’ నిర్వహించాలి : మాలేపాటి
ABN , First Publish Date - 2022-06-27T01:54:35+05:30 IST
బోగోలు మండలంలోని ప్రతి పంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిరధికంగా నిర్వహించాలని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.
కావలి, జూన్ 26: బోగోలు మండలంలోని ప్రతి పంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిరధికంగా నిర్వహించాలని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. బోగోలు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ఆదివారం కావలి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలు ప్రతి ఇంటికి చేరాలన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, మండలంలోని ముఖ్య నాయకులు, అన్ని పంచాయతీల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంద సంఘాల నాయకులు పాల్గొన్నారు.