వైసీపీ పాలనలో అంతా బాదుడే : మాలేపాటి
ABN , First Publish Date - 2022-08-08T02:50:42+05:30 IST
వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరల నుంచి అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలను బాదుతున్నారని కావలి టీడీపీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.
కావలి, ఆగస్టు 7: వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరల నుంచి అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజలను బాదుతున్నారని కావలి టీడీపీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. పట్టణతింలోని ఒకటోవ వార్డులోని మద్దూరుపాడులో ఆదివారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ధరల పెంపు వివరాలను తెలియచేసే కరపత్రాలు పంపిణీ చేశారు. తొలుత వార్డు స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వార్డులో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కోరారు. కొండా వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్బాబు, జ్యోతి బాబూరావు, పోతుగంటి శ్రీకాంత్, కొమరా వెంకటేశ్వర్లు, పిలిమిట్ల సుబ్రహ్మణ్యం, పులి శ్రీనివాసులు, వెంకటనారాయణ, ఆర్ రాఘవేంద్రరావు, సీహెచ్ శ్రీనివాసులు, బాలమురళీ, కొండలరావు, తిరుపతి, అక్కిలగుంట సూర్య తదితరులు పాల్గొన్నారు.