కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2020-10-20T13:34:47+05:30 IST

భారీ వర్షాల కారణంగా ఈ రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో జరగాల్సిన టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ పర్యటన వాయిదా పడింది.

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన వాయిదా

అమరావతి: భారీ వర్షాల కారణంగా ఈ రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో జరగాల్సిన టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ వర్గాలు సమాచారం అందజేశారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో లోకేశ్‌ పర్యటించారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.  ‘‘జగన్‌రెడ్డి ఆకాశంలోనే ఎక్కువకాలం పయనిస్తున్నారు. గాలి ప్రయాణాలు తగ్గించి ఆయన ఓ సారి కింద కాలు పెట్టాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రాష్ట్రంలో పరిస్థితిని ఏ సీఎం అయినా ప్రధానికి వివరిస్తారు. కానీ ప్రధానమంత్రే సీఎంకు ఫోన్‌ చేసి తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదేనా రైతు, సంక్షేమ రాజ్యం?’’ అని లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - 2020-10-20T13:34:47+05:30 IST