కృష్ణాష్టమి అంటేనే ఒక సందడి: Lokesh
ABN , First Publish Date - 2021-08-30T16:25:19+05:30 IST
రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. బాల్యంలోని అల్లరి, అమాయకత్వం, తల్లిప్రేమలోని మాధుర్యం... వీటిని గుర్తుకు తెస్తూ కృష్ణుడి వేషధారణలో తిరిగే పిల్లలు... కృష్ణాష్టమి అంటేనే ఒక సందడి అని అన్నారు. అదే సమయంలో స్నేహ ధర్మం, రాజనీతి, నమ్మినవారికి అండగా నిలవడం, ధర్మాన్ని కాపాడటం.. ఇలాంటి కర్తవ్యాలకు మార్గదర్శనం చేసింది కూడా కృష్ణుడే అని చెప్పారు. శ్రీకృష్ణుడు జన్మించిన శుభవేళ... ప్రజలందరికీ కృష్ణాష్టమి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.