కొండయ్యదొర సేవలు మరువలేం
ABN , First Publish Date - 2021-07-28T05:47:28+05:30 IST
టీడీపీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కందుల కొండయ్యదొర చేసిన సేవలను మరువలేమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
గండేపల్లి, జూలై 27: టీడీపీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కందుల కొండయ్యదొర చేసిన సేవలను మరువలేమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మురారి గ్రామంలో మంగళవారం నిర్వహించిన కొండయ్య దొర విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కొండయ్య దొర నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో పదవులు చేపట్టారన్నారు. ఎన్నో సేవలందించి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొండయ్యదొర సేవలను ఎన్నోసార్లు ప్రశంసించారన్నారు. మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, జడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, వర్మ, మేయర్ పావని, వనమాడి కొండబాబు, జిల్లా యువనాయకుడు కోర్పు సాయితేజ్, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, పోతుల మోహన్రావు, ఉండవల్లి శ్రీను, గద్దే అబ్బన్న, బులిరాజు, పోతుల లోవరాజు, ఎంపాటి రాజు, శీలామంతుల వీరబాబు, సుంకవల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
కొండయ్య కుటుంబానికి పరామర్శ
లోకేశ్ కొండయ్యదొర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని, ప్రత్యేక గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. కొండయ్యదొర, మాజీ సీఎం చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోలను పరిశీలించారు. కొండయ్య దొర కుమారుడితో కొద్దిసేపు మాట్లాడారు. గుర్తింపు లేకనే పార్టీ మారానని కొండయ్య సోదరుడు చిట్టిబాబు అన్నారు.