Kalva srinivasulu: తాడిపత్రి డీఎస్పీని సస్పెండ్ చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T17:14:45+05:30 IST

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ప్రోద్బలంతోనే వైసీపీ రౌడీలు పెట్రేగిపోతున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

Kalva srinivasulu: తాడిపత్రి డీఎస్పీని సస్పెండ్ చేయాలి

అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య (DSP Chaitanya) ప్రోద్బలంతోనే వైసీపీ (YCP) రౌడీలు పెట్రేగిపోతున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు (Kalva srinivasulu) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వరుసగా దళిత సామాజికవర్గానికి చెందిన కౌన్సిలర్ల టార్గెట్‌‌గా జరుగుతున్న దాడులు క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమన్నారు. డీఎస్పీ చైతన్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలు (TDp Leaders) కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కౌన్సెలింగ్ పేరుతో చితకబాది గాయాలపాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రోద్బలంతోనే టీడీపీ (TDP) కౌన్సిలర్లపై పదేపదే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.


వరుస దాడులతో టీడీపీ నేతలను భయకంపితులను చేసే దుర్మార్గమైన ఆలోచన వైసీపీ (YCP) చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఇలాంటి దాడులకు టీడీపీ భయపడదని.. దళితులపై జరుగుతున్న వరుసదాడులపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీడీపీ కౌన్సిలర్ల టార్గెట్‌గా జరుగుతున్న దాడులపై ఎస్పీ స్పందించాలన్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య (Tadipatri DSP)ను సస్పెండ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాల్వ శ్రీనివాసులు (Former minister) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-27T17:14:45+05:30 IST