కరోనా మరణాలు కాదవి ప్రభుత్వ హత్యలే: జవహర్

ABN , First Publish Date - 2021-05-11T14:09:02+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు.

కరోనా మరణాలు కాదవి ప్రభుత్వ హత్యలే: జవహర్

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా మరణాలు కాదవి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. రుయా సంఘటన మొదటిది కాదు గుణపాఠం నేర్చుకొని ప్రత్యేక శ్రద్ద పెట్టాలని హితవుపలికారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజల ప్రాణాలపై శ్రద్ద పెట్టాలన్నారు. ప్రణాలికతో కూడిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కరోనా మృతులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతులకు గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరిగేటట్లు చూడాలన్నారు. జగన్ అంతఃపురం వదిలి బయటకు వచ్చి ప్రజలకు బ్రతుకు భరోసా కల్పించాలని జవహర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-11T14:09:02+05:30 IST