ముస్లింలను విస్మరిస్తున్న సీఎం

ABN , First Publish Date - 2022-05-19T03:20:38+05:30 IST

ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ ముస్లిం సమాజాన్నే విస్మరిస్తున్నారని టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్‌ షరీఫ్‌ ఆరోపించారు.

ముస్లింలను విస్మరిస్తున్న సీఎం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న షరీఫ్‌

టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్‌

నెల్లూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ ముస్లిం సమాజాన్నే విస్మరిస్తున్నారని టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్‌ షరీఫ్‌ ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రికార్డులు బ్రేక్‌ చేసేలా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద రూ.5 లక్షల వరకు రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. నాడు దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు ఇస్తుంటే తాను రూ.లక్ష ఇస్తానని చెప్పిన సీఎం మోసం చేశారని విమర్శించారు. నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీలకు ఇవ్వలేదని, దీనిని బట్టే జగన్మోహన్‌రెడ్డికి ముస్లింలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనుద్దీన్‌, హయత్‌ బాబా, నియామతుల్లా, నన్నే సాహేబ్‌ తదితరులు 

Updated Date - 2022-05-19T03:20:38+05:30 IST