గత 28నెలలుగా నిలిచిన హంద్రీనీవా పనులు: Devineni
ABN , First Publish Date - 2021-08-26T15:08:35+05:30 IST
హంద్రీనీవా పనులు గత 28 నెలలుగా నిలిచిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.
అమరావతి: హంద్రీనీవా పనులు గత 28 నెలలుగా నిలిచిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...చంద్రబాబు హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల ద్వారా చివరి ప్రాంతానికి నీళ్లు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో కాంట్రాక్టర్లు ముందుకురాని నెలకొందన్నారు. ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్న..రైతులకు సమాధానం చెప్పండి? అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.