జేపీ కంపెనీకి గుంపగుత్తగా ఇసుకపై పెత్తనం: దేవినేని

ABN , First Publish Date - 2021-06-18T14:21:01+05:30 IST

ఇసుక పేరుతో దోచేస్తున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జేపీ కంపెనీకి గుంపగుత్తగా ఇసుకపై పెత్తనం: దేవినేని

అమరావతి: ఇసుక పేరుతో దోచేస్తున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా JP కంపెనీకి గుంపగుత్తగా ఇసుకపై పెత్తనం. జరుగుతున్న వేలకోట్ల దోపీడీ.  అందుబాటులో ఉండని వెబ్‌సైట్ ముందస్తుగా డబ్బులు చెల్లించినా సకాలంలో రాదు. గుట్టలు గుట్టలుగా డంపింగ్ చేసి, సామాన్యులకు ఇవ్వకుండా ఎక్కడికి తరలించి సొమ్ములు చేసుకుంటున్నారో ప్రజలకు చెప్పండి వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 





Updated Date - 2021-06-18T14:21:01+05:30 IST