త్వరలో దళితుల అణచివేత పథకం పెడతారేమో?: దేవతోటి
ABN , First Publish Date - 2020-11-28T14:42:20+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జగనన్న దళితుల అణచివేత పథకం పెడతారేమోనన్న అనుమానం కలుగుతోందని యెద్దేవా చేశారు. జగన్ మేనమామగా ఉంటానన్నది దళితుల ఇళ్లు కూల్చడానికా? అని ప్రశ్నించారు. అక్రమాలు చేసేది వైసీపీ నేతలు అయితే కూల్చేది దళితుల ఇళ్లులా అని నాగరాజు నిలదీశారు.