టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: Devathoti
ABN , First Publish Date - 2021-10-20T14:26:17+05:30 IST
టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమమన్నారు.
అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమమన్నారు. దాడులకు, బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడతారనుకోవటం పగటి కల అని తెలిపారు. చర్యకు ప్రతిచర్య అన్నట్టు ముందు రోజుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని దేవతోటి నాగరాజు హెచ్చరించారు.