నెల్లూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు చేరుకున్నారు. నాయుడుపేట గోమతి సెంటర్లో బాబుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అభిమానులు స్వంచ్ఛందంగా తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కోట, చిల్లకూరు, నెల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.