కళా వెంకట్రావు ఏం తప్పు చేశారు?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-01-21T16:26:04+05:30 IST

రాష్ట్రంలో ఉన్మాది పాలనకు టీడీపీ నిరసన తెలియజేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు.

కళా వెంకట్రావు ఏం తప్పు చేశారు?: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఉన్మాది పాలనకు టీడీపీ నిరసన తెలియజేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రామతీర్థంలో విజయసాయిని ఏ చట్టం కింద అనుమతించారని నిలదీశారు. అసలు డీజీపీకి లా అండ్ ఆర్డర్ అమలు చేయడం వచ్చా అని మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టిన తమకు లెక్కలేదన్నారు. ఏ రూల్ కింద కళావెంకట్రావ్‌ను అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. రాముడు తలను నరికేస్తే తాము వెలితే అడ్డుపడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమరు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తారా... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా అని మండిపడ్డారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రకుకు అనుమతి ఇచ్చి నేడు తిరస్కరిస్తారా అని...తమ వాళ్ళను నిర్బంధిస్తారా అని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నిన్న రాత్రి 9:30 గంటలకు కళావెంకట్రావ్‌ను అరెస్టు చేస్తారా అని ధ్వజమెత్తారు. టాబ్లెట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరా...‘‘మీ ఆటలు సాగాలంటే మమ్మల్ని, ప్రజల్ని కూడా జైల్‌లో పెట్టండి’’ అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. 

Updated Date - 2021-01-21T16:26:04+05:30 IST