టీడీపీ నేత Bonda uma కేసుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-11-03T17:53:20+05:30 IST
టీడీపీ నేత బోండా ఉమా కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: టీడీపీ నేత బోండా ఉమా కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిని దూషించారంటూ ఇటీవల బోండా ఉమాపై గుంటూరు అరండల్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఉమా తరపు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం... సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది.