అమర్ ఖబడ్దార్... చంద్రబాబును టచ్ చేసి చూడు: Mahesh
ABN , First Publish Date - 2021-10-24T17:40:51+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరేటి మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విశాఖపట్నం: వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరేటి మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్.. మంత్రి పదవి కోసం చంద్రబాబుపై దిగజారిమాట్లాడుతున్నారన్నారు. ‘‘అమర్ ఖబడ్దార్ .. చంద్రబాబు నాయుడుని టచ్ చేసి చూడు.. బ్లాక్ కామెండోలు కాల్చి పారేస్తారు’’ అంటూ హెచ్చరించారు. గంజాయి, హెరాయిన్కి కేరాఫ్ అడ్రస్గా ఏపీ మారిందన్నారు. పీకే డైరెక్షన్లో సీఎం జగన్ బాధ్యతారహితంగా మాట్లాడారని.. అందుకే తమ పార్టీకార్యాలయాలపై దాడి జరిగిందని మండిపడ్డారు. గంజాయితో తమకు సంబంధం లేదని గంగాజలం మీద కానీ, బైబిల్ మీద కానీ జగన్ ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. వైసీపీవి జనాగ్రహ దీక్షలు కావవి..జబర్దస్త్ దీక్షలని అరేటి మహేష్ వ్యాఖ్యానించారు.