చంద్రబాబు దీక్షకు తరలిన నాయకులు

ABN , First Publish Date - 2021-10-22T05:57:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో చేపట్టిన 36 గంట దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హిందూపురం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి.

చంద్రబాబు దీక్షకు తరలిన నాయకులు

హిందూపురం, అక్టోబరు 21: టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో చేపట్టిన 36 గంట దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హిందూపురం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. ఈ దీక్షకు హిందూపురం నుంచి భారీగా తరలివెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం నుంచి నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబికా ఇంటి వద్దకు ఉదయం పోలీసులు వెళ్లి ఇల్లు విడిచి వెళ్లకూడదంటూ సూచించారు. కాసేపు అక్కడే ఉండి అనంతరం పోలీసులు వెళ్లిపోయారు. ఇలా టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు ఆరా తీశారు. అయితే తెల్లవారుజూమునే పట్టణంతోపాటు లేపాక్షి, చిలమత్తూరు నుంచి టీడీపీ నాయకులు చంద్రబాబు దీక్షకు భారీగానే తరలివెళ్లారు. చంద్రబాబు దీక్షకు తరలివెళ్లిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, పట్టణ అధ్యక్షులు రమేష్‌, జేఈ అనిల్‌కుమార్‌, అమర్‌నాథ్‌, పార్లమెంట్‌ మహిళ ఉపాధ్యక్షురాలు వడ్డే శ్రీదేవి, చిలమత్తూరు టీడీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి, పాపన్నతోపాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Updated Date - 2021-10-22T05:57:40+05:30 IST