వేగంగా టీడీపీ సభ్యత్వ నమోదు: నెహ్రూ
ABN , First Publish Date - 2022-05-25T05:52:55+05:30 IST
జగ్గంపేట, మే 24: టీడీపీ సభ్యత్వ నమోదును చాలా వేగంగా నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యక్షు డు జ్యోతుల నెహ్రూ సూచించారు. రావులమ్మనగర్లో టీడీపీ కార్యాలయంలో నెహ్రూ అధ్యక్షతన నియోజకవర్గ టీడీపీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సభ్యత్వాల నమోదు, సాంకేతికపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతిక సమస్యలపై
జగ్గంపేట, మే 24: టీడీపీ సభ్యత్వ నమోదును చాలా వేగంగా నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యక్షు డు జ్యోతుల నెహ్రూ సూచించారు. రావులమ్మనగర్లో టీడీపీ కార్యాలయంలో నెహ్రూ అధ్యక్షతన నియోజకవర్గ టీడీపీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సభ్యత్వాల నమోదు, సాంకేతికపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతిక సమస్యలపై రాష్ట్ర ప్రతినిధుల ను అడిగి తెలుసుకుని ఎక్కువ సభ్యత్వ నమోదు చేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో అధిక శాతం నమోదు పూర్తి చేద్దామన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టీడీపీ మండలాధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, మంగరౌతు రామకృష్ణ, చదరం చంటిబాబు, నియోజకవర్గ టీడీపీ చాంపియన్ కూచిమంచి బాలరాజు, బోదిరెడ్ల సుబ్బారా వు, ముమ్మన కాశి, రామిశెట్టి సత్యనారాయణ, టీ డీపీ ప్రతినిధులు కాకిలేటి బుజ్జి, టెంపర్ సురేష్, పడాల బాలాజీ పాల్గొన్నారు. జగ్గంపేటకు చెంది న బొడ్డుకొండ వీర్రాజు అబ్బాయి రిసెప్షన్కు నెహ్రూ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.