రైతుల అరెస్ట్‌పై నిరసన

ABN , First Publish Date - 2020-10-31T04:28:03+05:30 IST

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొన్ని నెలుగా ఉద్యమం చేస్తున్నారని, దళిత, బీసీ రైతులను అరెస్టు చేసి బేడీలు వేయడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

రైతుల అరెస్ట్‌పై నిరసన

ఆచంట, అక్టోబరు 30: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొన్ని నెలుగా ఉద్యమం చేస్తున్నారని, దళిత, బీసీ రైతులను అరెస్టు చేసి బేడీలు వేయడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలు వద్ద నిరశన వ్యక్తం చేసి పూల మాలలు వేశారు. అనంతరం తహసీల్దార్‌  కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కేతా మీరయ్య, బండి రామారావు, టి.ప్రసాద్‌, బాలం వెంకటరమణ, చిలుకూరి సీతారామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T04:28:03+05:30 IST