టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-05-27T03:11:05+05:30 IST
టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. గురువారం మం
కొండాపురం, మే26: టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. గురువారం మండలంలోని గొట్టిగుండాలలో జరిగిన మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒంగోలులో జరిగే మహానాడుకు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. అంతకుముందు జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తల్లపనేని లక్ష్మీనారాయణ, యారవ క్రిష్ణయ్య, పోలినేని రమేష్, చెంచలబాబు యాదవ్, నవీన్, చెరుకూరు వెంకటాద్రి, జాగర్లమూడి శ్రీనివాసులు, కుంకు మోహనరావు తదితరులు పాల్గొన్నారు.