నేడు టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
ABN , First Publish Date - 2021-02-28T05:47:52+05:30 IST
గుంటూరు నగరపాలకసంస్థ ఎన్ని కలపై టీడీపీ మమ్ముర కసరత్తు చేస్తోంది. కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాపై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరి కేంద్ర కార్యా లయంలో జిల్లా ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వ హించారు.
కొలిక్కి వచ్చిన రెబల్స్ సమస్య
ఆశావహులను బుజ్జగించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరు(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి27: గుంటూరు నగరపాలకసంస్థ ఎన్ని కలపై టీడీపీ మమ్ముర కసరత్తు చేస్తోంది. కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాపై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరి కేంద్ర కార్యా లయంలో జిల్లా ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వ హించారు. ప్రధానంగా ఆశావహులు ఎక్కువుగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బరిలో ఉన్న రెబల్స్ను బుజ్జగించే పనిలోపడ్డారు. కొందరు రెబల్ అభ్యర్థులతో శుక్రవారం అచ్చెన్న నేరుగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారిని సముదాయించే కార్యక్రమం చేశారు. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ శనివారం రంగప్రవేశం చేశారు. మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోవెలమూడి రవీంద్ర, తూర్పు ఇన్ఛార్జ్ మహ్మద్ నసీర్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు చిట్టాబత్తుని చిట్టిబాబు, పోతినేని శ్రీనివాసరావు, గంజి చిరంజీవిలతో కలసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్ర వారం అచ్చెన్న సమక్షంలో తుది చర్చలు జరిపినట్టు సమాచారం. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఒకటికంటే ఎక్కువ మంది నేతలు నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు ఎవరికీ బీఫారాలు అందలేదు. అలాగే 13 వ డివి జన్లో బీ-ఫారం ఇచ్చిన అభ్యర్థి మృతి చెందారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ తన తుది జాబితాను సిద్ధం చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ వివరాలను ఆదివారం ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించను న్నట్టు తెలిసింది.