ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి
ABN , First Publish Date - 2020-11-30T06:14:05+05:30 IST
ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి
ఉంగుటూరు/హనుమాన్జంక్షన్ రూర ల్/ గన్నవరం, నవంబరు 29 : తుఫాను ప్రభావంతో పంటనష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని, మొలకలొచ్చిన, ముక్కిపోయిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఉంగుటూరు, వేలేరు, దావాజీగూడెంలో నివర్ తుఫాను తాకిడికి నీటమునిగిన వరిపంటను ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సం ఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, పొట్లూరి గోపీచంద్, మహిళానేత కళ్యాణి, వేము లపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమా వరప్రసాద్, మొవ్వా వెంకటేశ్వరరావు జాస్తి వెంకటేశ్వరరావు, జూపల్లి సురేష్, కారంపూడి సాంబశివరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.