అన్నదాత రోదనలు వినండి
ABN , First Publish Date - 2021-06-20T05:24:15+05:30 IST
కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్నజీర్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రైతు అధ్యక్షుడు చినదేముడులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
బకాయిలు చెల్లించి ఆదుకోండి
కలెక్టర్కు ఇచ్చిన వినతిపత్రంలో టీడీపీ వినతి
విశాఖపట్నం, జూన్ 19: కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్నజీర్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రైతు అధ్యక్షుడు చినదేముడులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్కు వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమవేశంలో వారు మాట్లాడారు. ధాన్యం బకాయిలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమకాలేదన్నారు. ప్రభుత్వ మద్దతు ధర వల్ల ప్రస్తుతం రైతులు క్వింటాలుకు రూ.800 నష్టపోతున్నారన్నారు. జల్లాలో అధిక సంఖ్యలో కౌలురైతులున్నా వారికి ఎరువులు, విత్తనాలు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులందరికీ పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ సాయం అందించాలని కోరారు.