మహానాడును విజయవంతం చే యండి
ABN , First Publish Date - 2020-05-27T09:42:53+05:30 IST
తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ..
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు
టెక్కలి, మే 26: తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన లో కోరారు. ఈనెల 27, 28 తేదీల్లో జరుగు మహాసభలో పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు భాగస్వాములు కావాలని కోరారు. కరోనా నేపథ్యంలో మహా నాడు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు జూ మ్ యాప్ను ఇన్స్టాల్ ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన ఆహ్వానం లింక్ను ట్యాబ్ చేసి స్ర్కీన్ నేమ్ వద్ద మీపేరు, ఇ-మెయిల్ వద్ద మహానాడు ఎట్దిరేటాఫ్ టీడీపీ.కామ్ అని టైప్చేసి పాల్గొనాలని కోరారు. మహాసభల్లో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారని, అలాగే 28న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.