జిల్లాలో క్షయ నివారణ చర్యలు భేష్‌

ABN , First Publish Date - 2021-10-28T05:26:09+05:30 IST

క్షయ వ్యాధి నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయని కుటుంబ, ఆరోగ్య సంక్షే మ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ ఎం. అనూరాధ తెలిపారు.

జిల్లాలో క్షయ నివారణ చర్యలు భేష్‌
కలెక్టర్‌తో సమావేశమైన రీజనల్‌ డైరెక్టర్‌ అనూరాధ, బృందం

ఏలూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధి నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయని కుటుంబ, ఆరోగ్య సంక్షే మ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ ఎం. అనూరాధ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న బృం దం బుధవారం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిసి నివేదికను అందజేసింది. జూట్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, చిన్నపిల్లలకు తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆమె తెలిపారు. జిల్లా క్షయ నివారణ కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో రెండు బృందాలుగా చింతలపూడి, భీమడోలు మండలంలో, ఏలూరు జిల్లా ఆస్పత్రి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ఆస్పత్రు ల్లో పర్యటించి ఏఆర్‌టీ, ఐటీడీసీ చికిత్సా కేంద్రాలను, ఆశ్రం ఆస్పత్రిని పరిశీ లించామన్నారు. జేసీ శుక్లా, టీం లీడర్‌ కరెల్‌, వినీత్‌ కుమార్‌, ఎన్టీఈపీ, డబ్ల్యూ హెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ మహేశ్‌ గొర్లం, డీఎంహెచ్‌ఓ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:26:09+05:30 IST