చెరువుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2020-12-02T04:50:52+05:30 IST

చెరువుకు మరమ్మతులు

చెరువుకు మరమ్మతులు
ఫరూఖ్‌నగర్‌లో పైప్‌లైన్‌ మరమ్మతులను పరిశీలిస్తున్న నరేందర్‌

షాద్‌నగర్‌ అర్బన్‌: ఫరూఖ్‌నగర్‌ గ్రామానికి ఆనుకొని ఉన్న జానమ్మ చెరువుకు 15లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేంద ర్‌ తెలిపారు. మంగళవారం ఫరూఖ్‌నగర్‌లోని తాగునీటి పైపులైన్‌ మరమ్మతులను, జానమ్మ చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ షాద్‌నగర్‌, ఫరూఖ్‌నగర్‌ జంట పట్టణాల మధ్య ఉన్న జానమ్మ చెరువుకు మరమ్మతులు చేసి, అందులో ని నీటిని శుద్ధి చేయిస్తానని తెలిపారు. జానమ్మ చెరువును మినీ ట్యాంక్‌గా అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. ఫరూఖ్‌నగర్‌ గ్రామానికి వెళ్లే పైపులైన్‌కు మరమ్మతులు చేయించి, తాగునీటి సరఫరా ను పునరుద్ధరిస్తున్నామన్నారు. పట్టణం లోని అన్ని చోట్లా మిషన్‌ భగీరథ పైపులైన్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోందని అన్నారు. షాద్‌నగర్‌ చౌరస్తా నుంచి జడ్చర్ల, హైదరాబాద్‌, పరిగి రోడ్లపై విద్యుత్తు లైటింగ్‌ విధానాన్ని అభివృద్ధి పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్‌ నరేందర్‌ వివరించారు.


Updated Date - 2020-12-02T04:50:52+05:30 IST