తమిళనాడులో 4వేలకు పైగా కరోనా కేసులు.. 1500 దాటిన మరణాలు

ABN , First Publish Date - 2020-07-06T01:09:08+05:30 IST

తమిళనాడులో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11వేలు,,,

తమిళనాడులో 4వేలకు పైగా కరోనా కేసులు.. 1500 దాటిన మరణాలు

చెన్నై: తమిళనాడులో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా11వేలు దాటేసింది. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం తాజాగా నమోదవుతున్న కేసులు కొద్దగా తగ్గుముఖం పట్టాయి. కొది రోజుల క్రితం వరకు దాదాపు 5వేల వరకు నమోదైన కేసులు ప్రస్తుతం 4వేలకే పరిమితమవుతున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య  శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,150 కరోనా కేసులు నమోదయ్యాయి. 60 మంది మరణించారు. 2,186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,151కి చేరింది. వీరిలో 46,860మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 62,778మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,510మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-06T01:09:08+05:30 IST