‘బహిరంగ ప్రాంతాల్లో ఆవిరి ఆరోగ్యానికి హానికరం’

ABN , First Publish Date - 2021-05-18T18:02:21+05:30 IST

వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఔషధాల మిశ్రమంతో ఆవిరి పట్టడం

‘బహిరంగ ప్రాంతాల్లో ఆవిరి ఆరోగ్యానికి హానికరం’

  • మంత్రి సుబ్రమణ్యం హెచ్చరిక

చెన్నై/ప్యారీస్‌ : వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఔషధాల మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచిదేనని, అయితే ఇందుకు బహిరంగ ప్రాంతాలు అనువైనవి కావని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజురోజుకు కరోనా తీవ్రరూపం దాల్చు తుండడంతో వైద్యనిపుణుల సూచనలతో బహిరంగ ప్రాంతాల్లో పసుపు, కర్పూరం, వేపాకు, తులసి మిశ్రమాన్ని యంత్రాల ద్వారా ఆవిరి రూపంలో ప్రజలు పీల్చే సౌకర్యం కల్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సుబ్ర మణ్యం, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశముందన్నారు. చెన్నై, తిరుచ్చి, ఈరోడ్‌, కోయంబత్తూర్‌ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ప్రజలు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ తదితర బహిరంగ ప్రాంతాల్లో మూలికల మిశ్రమంతో ఆవిరి పడుతున్నారని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇలా చేయరాదని మంత్రి హెచ్చరించారు.


Updated Date - 2021-05-18T18:02:21+05:30 IST