తమిళనాడు సీఎం తెలుగువారే!

ABN , First Publish Date - 2021-05-09T08:10:24+05:30 IST

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపఽథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్‌ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే...

తమిళనాడు సీఎం తెలుగువారే!

  • స్టాలిన్‌ పూర్వీకులది ప్రకాశం జిల్లానే
  • స్వయంగా చెప్పిన దివంగత కరుణానిధి
  • నాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామస్థులు

ఒంగోలు(కల్చరల్‌), మే 8: తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని విజయపఽథంలో నడిపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్‌ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోవే. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాం తానికి వచ్చారు. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తిగడించారు. ఒంగో లు శివారు పెళ్లూరు గ్రా మంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళవాయిద్యాలను మో గించేవారు. పెళ్లూరు ప్రాం తం మొత్తం వెంకటగిరి రా జాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకు లు నివసించటానికి దగ్గరలో ని చెరువుకొమ్ముపాలెం గ్రా మంలో వీరికి నివాసస్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చి, రాజా వారి ఆస్థానంలో పనిచేసేవారు. వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలాకాలం పనిచేశారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవడంతో వారి జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రా మంలోని వృద్ధులు పేర్కొన్నారు. 


స్టాలిన్‌ పూర్వీకులది మా ఊరే!

డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పూర్వీకులది మా ఊరే. వారు ఆనాడు వెంకటగిరి రాజా ఇచ్చిన పొలాలు సాగు చేసుకుంటూ, ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారని స్వయంగా కరుణానిధి చెప్పటంతో తెలిసింది. మా తాతలు మాత్రం ఊరిలోనే ఉండిపోగా, కరుణానిధి తాతలు తంజావూరు వలసవెళ్లారు.

 -పెళ్లూరి వెంకటేశ్వర్లు, చెర్వుకొమ్ముపాలెం



అభిమానం చూపే కరుణానిధి

కరుణానిధి సైతం తన తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్‌ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్‌ నవ లా రచయిత జలంధర్‌ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు, ఆనందంతో తమ ప్రాంతం గురించి అ డిగారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు తెలిపారు. కరుణానిధి జీవించి ఉన్న సమయంలో పలుసార్లు త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఇక్కడి నాదస్వర కళాకారులు తంజావురుకు వెళ్లినప్పుడు ఆయనను ప్రత్యేకంగా కలిశారు.

Updated Date - 2021-05-09T08:10:24+05:30 IST