మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-02-26T04:52:52+05:30 IST
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 25: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోసం నియమించిన నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్ఈసీ జారీ చేసిన ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. సమావేశంలో జేసీ వీరబ్రహ్మం, డీఆర్వో మురళి, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.