ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: టీడీపీ
ABN , First Publish Date - 2022-07-04T06:04:02+05:30 IST
మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ ప్ర జా వ్యతిరేక విధానాలు, పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని హిందూపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నరసింహ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చిలమత్తూరు, జూలై 3: మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ ప్ర జా వ్యతిరేక విధానాలు, పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని హిందూపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నరసింహ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో బూత కమిటీల నియామకంపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, డాక్టర్ సురేంద్ర, హిందూపురం పార్లమెంట్ ప్ర ధాన కార్యదర్శి అంబికా లక్ష్మినారాయణ, మాజీ రాష్ట్ర కార్యదర్శి దే మకేతేపల్లి అంజినప్ప ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ ని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. వైసీపీ తప్పిదాలను, ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడాలన్నారు. పార్టీని పటిష్టపరిచేం దుకు బూత కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఆరు బూతలకు ఒక ఇనచార్జ్ని నియమించి, మండల వ్యాప్తంగా గ్రామస్థాయిలో పా ర్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. స మావేశంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్, నాయకులు నందీషప్ప, అశ్వర్థప్ప, రామాంజనమ్మ, శ్రీదేవి, పరిమల, నాగరాజు పాల్గొన్నారు.
కార్యకర్తకు ఆర్థికసాయం
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఉపాధి కోల్పోయిన టీడీపీ కార్యకర్త రఫిక్కు టీడీపీ నాయకులు తమవంతుగా ఆర్థికసాయం అందించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావుతో కలిసి స్థానిక నా యకులు స్పందించి సాయం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని వారు ధైర్యం చెప్పారు.