అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-27T04:37:44+05:30 IST

అవకాశాలను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
స్టడీమెటీరియల్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 


ఇబ్రహీంపట్నం, జూన్‌ 26: అవకాశాలను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో ముందుకెళ్తేనే ప్రభుత్వ ఉద్యోగాలు సొంతమవుతాయని  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పోలీస్‌, గ్రూప్స్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న 750మంది అభ్యర్థులకు ఆదివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ పొంది ఇప్పటికే 386 మంది పోలీస్‌ ఉద్యోగాలు, 16మంది జూనియర్‌ పంచాయతీ ఉద్యోగాలు, మరికొందరు వివిధ కేటగిరిలో ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి జెర్కోని రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఎంకేఆర్‌ ఫ్యాకల్టీ వెంకట్‌, నరేష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-27T04:37:44+05:30 IST