పరోక్ష సేవలను సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2021-05-16T06:19:56+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాణిపాక వరసిద్ధుడి దర్శన వేళల్లో మార్పు చేసిన కారణంగా భక్తులు పరోక్ష సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో వెంకటేశు భక్తులను కోరారు.
భక్తులకు కాణిపాక ఆలయ ఈవో వెంకటేశు
ఐరాల(కాణిపాకం), మే 15: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాణిపాక వరసిద్ధుడి దర్శన వేళల్లో మార్పు చేసిన కారణంగా భక్తులు పరోక్ష సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో వెంకటేశు భక్తులను కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ పరోక్ష సేవల్లో భాగంగా స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, పాలాభిషేకం, కల్యాణోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షీరాభిషేకానికి రూ.150, ప్రత్యేక అభిషేకానికి రూ.550, నిత్యకల్యాణానికి రూ.616, గణపతి హోమం నిర్వహణకు రూ.500 చెల్లించాలన్నారు. భక్తులు ఎస్బీఐ అకౌంట్ నెంబరు 30160990250, ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బీఐఎన్ 0010105 నగదు ఆన్లైన్లో చెల్లించి స్వామివారి సేవలను యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చన్నారు. అలాగే ఈ హుండీ ద్వారా స్వామివారికి కానుకలు సమర్పించవచ్చన్నారు.