ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-02T05:00:29+05:30 IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే కోడూరు ఎలకీ్ట్రషియన్స అసోసియేషన్‌ అధ్యక్షుడు కొరముట్ల నరసింహులు, కార్యదర్శి పండ్రా సుబ్రహ్మణ్యం తెలిపారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

రైల్వేకోడూరు, జూలై 1: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే కోడూరు ఎలకీ్ట్రషియన్స అసోసియేషన్‌ అధ్యక్షుడు కొరముట్ల నరసింహులు, కార్యదర్శి పండ్రా సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరులోని ఎర్ర చందనం పార్కులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రైల్వేకోడూరులో ఎలకి్ట్రకల్‌ పనులు నిర్వహించే వారు ఐక్యంగా ఉండాలని కోరారు. ప్రతి నెల 1న సెలవు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు జీవిత బీమా చేయించుకోవాలన్నారు. కార్మికశాఖ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు. అందరం కలసి కట్టుగా ఉంటే సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గుర్తింపుకార్డులు రాని వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధాన కార్యదర్శి మోహనాచారి, గౌరవ సలహాదారు పండ్రా రాంబాబు, కోశాధికారి రాజేంద్రనాయుడు, గౌరవాధ్యక్షుడు అలుగంటి ధశరథరామయ్య  పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:00:29+05:30 IST