ఎంపీ సత్యవతిని అవమానించటం మంత్రికి తగదు
ABN , First Publish Date - 2022-05-19T06:09:53+05:30 IST
గవర కులానికి చెందిన అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు అన్నారు.
కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు
గాజువాక, మే 18: గవర కులానికి చెందిన అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు అన్నారు. గాజువాకలో ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫొటోను తీయించటమే కాకుండా, ఎంపీ వస్తే ఆ కార్యక్రమానికి రానని మంత్రి అనటం అవమానించటమేనని వివరించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గాజువాక గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు మారిశెట్టి మల్లెపూలరావు, కేంద్ర గౌరీ సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకటరావు, ప్రతినిధులు మల్ల అనంతరావు, సింహాచలం పాల్గొన్నారు.