ఈత.. కడుపు కోత

ABN , First Publish Date - 2022-01-27T05:28:46+05:30 IST

ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ఉసురుతీసింది. వారి కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిల్చింది. ఈవిషాద సంఘటన మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పేరంగుడిపల్లికి చెందిన ఇండ్లా దినేష్‌ (12), ఇండ్లా లోకేష్‌ (11) గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్‌లో కార్యక్రమం ముగిసిన తరువాత ఇంటికి వచ్చిన వారు మరో ఐదుగురితో కలిసి గ్రామంలోని వాగు వద్దకు ఈతకు వెళ్లారు. తోటి విద్యార్థులతో కలిసి దినేష్‌, లోకేష్‌ వాగులోకి దూకారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ మునిగిపోయారు.

ఈత.. కడుపు కోత
లోకేష్‌ భౌతిక కాయంపై పడి రోధిస్తున్న బంధువులు (ఇన్‌సెట్లో) వాగులోపడి మృతిచెందిన దినేష్‌

వాగులోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతి

పరంగుడిపల్లిలో విషాదం 

కనిగిరి, జనవరి 26 : ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ఉసురుతీసింది. వారి కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిల్చింది. ఈవిషాద సంఘటన మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పేరంగుడిపల్లికి చెందిన ఇండ్లా దినేష్‌ (12), ఇండ్లా లోకేష్‌ (11)  గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్‌లో కార్యక్రమం ముగిసిన తరువాత ఇంటికి వచ్చిన వారు మరో ఐదుగురితో కలిసి గ్రామంలోని వాగు వద్దకు ఈతకు వెళ్లారు. తోటి విద్యార్థులతో కలిసి దినేష్‌, లోకేష్‌ వాగులోకి దూకారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ మునిగిపోయారు. మిగిలిన విద్యార్థులు పైకి వచ్చి వారిద్దరూ మునిగిపోయిన విషయాన్ని గుర్తించి సమీపంలో ఉన్న పేరంగుడిపల్లి గ్రామస్థులకు తెలిపారు.  హుటాహుటిన వాగువద్దకు చేరుకున్న వారు దినేష్‌, లోకే్‌షలను యబటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులిద్దరూ వరుసకు అనమ్మదమ్ములు. కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు వారి మృతదేహాలపై పడి భోరున విలిపించడం చూపరులను కలిచివేసింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 



Updated Date - 2022-01-27T05:28:46+05:30 IST