అహోబిలంలో స్వాతి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-06T05:49:31+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ, ఆగస్టు 5: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. అలాగే నవ నరసింహస్వామి క్షేత్రాలలో అభిషేకాలు, విశేష పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో నవకలశాలతో సుదర్శన హోమాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య చేపట్టారు. కార్యక్రమాల్లో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.