నయనానందకరం.. శ్రీవారి మల్లె పూలోత్సవం
ABN , First Publish Date - 2022-05-17T05:39:32+05:30 IST
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మల్లె పూలోత్సవం సోమవారం నయనానందకరంగా సాగింది. ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవసంతవల్లభ స్వామికి ప్రత్యేక పల్లకిలో మల్లెపూల అలంకరణ గావించారు.
కదిరి, మే 16: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మల్లె పూలోత్సవం సోమవారం నయనానందకరంగా సాగింది. ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవసంతవల్లభ స్వామికి ప్రత్యేక పల్లకిలో మల్లెపూల అలంకరణ గావించారు. తిరుమాడ వీధుల్లో ఉత్సవం నిర్వహించారు. మల్లెపూలతో అలంకరించిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్, చైర్మన గోపాలకృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.