అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-06-13T04:51:06+05:30 IST
మండలంలోని ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ శ్వేతా తెలిపిన వివరాల ప్రకారం.. ఎండిషేక్(42) మద్యాని కి బానిసైయ్యాడు. పేకాట ఆడుతూ జూలయిగా తిరిగేవాడు.
ఎల్లారెడ్డి, జూన్ 12: మండలంలోని ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ శ్వేతా తెలిపిన వివరాల ప్రకారం.. ఎండిషేక్(42) మద్యాని కి బానిసైయ్యాడు. పేకాట ఆడుతూ జూలయిగా తిరిగేవాడు. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. భార్య చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తీర రామాలయం వెనుక గల ఖాళీ స్థలంలో గాయాలతో చనిపోయి ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శవాన్ని పరిశీలించారు. భార్య నాజియాభేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
భిక్కనూరు, జూన్ 12: దోమకొండ మండలంలోని మహ్మదాపూర్ గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మహ్మదా పూర్ గ్రామానికి చెందిన పందిరి బాల్రెడ్డి(45) భిక్కనూరు ఎంఎస్ఎన్ ఫా ర్మా కంపెనీలో గత రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. విధులు నిర్వ హిస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. బాల్రెడ్డికి తీవ్రగాయాలు కాగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.