కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-30T05:29:49+05:30 IST
కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి భాస్కర్రెడ్డి (44) మృతిచెందిన సంఘటన బుధవారం మండలం లోని కేశవరాయునిపేట గ్రా మంలో జరిగింది.
యాడికి, జూన్ 29: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి భాస్కర్రెడ్డి (44) మృతిచెందిన సంఘటన బుధవారం మండలం లోని కేశవరాయునిపేట గ్రా మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు కేశవరా యునిపేట గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి తనకు ఉన్న 10ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులను చూసు కుంటూ జీవనం సాగిస్తున్నాడు. భాస్కర్రెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యను పెళ్లి అయిన రెండేళ్లకే వదిలేసి ఆ తర్వాత గుంటూరుకు చెందిన కల్పనను వివాహం చేసుకు న్నాడు. ఆమె గుంటూరులోనే ఉంటూ అక్కడికే రావాలని ఒత్తిడి చేసేది. సొంత గ్రామంలో తల్లిదం డ్రులను వదిలి వెళ్లలేక, అక్కడ భార్యను వదిలి ఉండలేక సతమ తమయ్యేవాడు. మంగళవారం రాత్రి కేశవరా యునిపేటలో పురు గుల మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడని, చికిత్స నిమిత్తం అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు.