ఆ విషయంలో రియా ఆనందపడాలి: సుశాంత్ స్నేహితుడు

ABN , First Publish Date - 2020-08-10T01:50:56+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని...

ఆ విషయంలో రియా ఆనందపడాలి: సుశాంత్ స్నేహితుడు

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని అతడి ప్రేయసి రియా చక్రవర్తి అనేకసార్లు మీడియా ముందే కోరారు. అయితే ప్రస్తుతం ఆమె మాట మారుస్తున్నారు. దీనిపై సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ మృణాల్ స్పందించారు. సీబీఐ దర్యాప్తు కావాలని రియానే మొదటి నుంచి కోరిందని, ప్రస్తుతం ఆమె సంతోషించాలని అన్నారు. అయితే వారినుంచి తప్పించుకుంటూ ఎందుకు దాక్కుంటుందో అర్థం కావడం లేదని, రియా సీబీఐకి సహకరించాలని మృణాల్ పేర్కొన్నారు. ‘ఒకవేళ రియా నిరపరాధి అయితే చీకటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది. అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ ఏడాదిలో రూ.15కోట్లు ఎలా ఖర్చు పెడతాడు. ఏదిఏమైనా సీబీఐ రంగంలోకి దిగింది. నిజం కచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నా’నంటూ నీలోత్పల్ మృణాల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T01:50:56+05:30 IST