ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ...రైతు మృతి

ABN , First Publish Date - 2021-10-04T14:35:52+05:30 IST

జిల్లాలోని మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది.

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ...రైతు మృతి

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలుకూరుకి చెందిన రైతు పిల్లుట్ల వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా...డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు తరలిస్తుండగా వెనుక నుంచి  కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-04T14:35:52+05:30 IST