దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిటీ లాంటిది దూబే కేసులో వేస్తాం: సుప్రీం

ABN , First Publish Date - 2020-07-16T07:36:06+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే వ్యవహారంపై దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘దిశ’ కేసును ప్రస్తావించింది...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిటీ లాంటిది దూబే కేసులో వేస్తాం: సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే వ్యవహారంపై దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘దిశ’ కేసును ప్రస్తావించింది. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీజే బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాస నం విచారణ చేపట్టింది. అయితే, నిరుడు  దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై దర్యాప్తునకు నియమించిన కమిటీ తరహాలో వికాస్‌ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకు కమిటీని నియమించాలని భావిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.  

Updated Date - 2020-07-16T07:36:06+05:30 IST