స్మృతివనం ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-29T02:56:52+05:30 IST

ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి స్మృతివనం ఏర్పాటుకు శనివారం స్థల పరిశీలన జరిగింది

స్మృతివనం ఏర్పాటుకు స్థల పరిశీలన
స్మృతివనం ఏర్పాటుపై పరిశీలన చేస్తున్న మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి, తదితరులు

ఉదయగిరి, మే 28: ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి స్మృతివనం ఏర్పాటుకు శనివారం స్థల పరిశీలన జరిగింది. ఢిల్లీలోని సుప్రసిద్ధ అర్కిటెక్చర్‌ రాహుల్‌ మెహరోత్రా వారి ప్రతినిధి ప్రియాకోచ్‌ ఇందుకు సంబంధించి కళాశాలలో పలు ప్రదేశాలను పరిశీలించి, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడు తూ  తాగు, సాగునీటి కోసం పోలవరం, వెలుగొండ, సోమశిల హైలెవల్‌ కెనాల్స్‌ పూర్తయితే మెట్ట మండలాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాజుద్దీన్‌, నజీముద్దీన్‌, ఫారుఖ్‌అలీ, కళాశాల ప్రిన్సిపాల్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-29T02:56:52+05:30 IST