ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-04T05:47:05+05:30 IST

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

శంషాబాద్‌ రూరల్‌ జూలై 3: మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండుపల్లి గ్రామానికి చెందిన చాకలి నందకిశోర్‌(26) ఇంటి పక్కనున్న బోరు మోటార్‌ నుంచి వచ్చే నీటితో మురుగు ఏర్పడుతోందని మోటార్‌ను ఆఫ్‌ చేశాడు. ఇది చూసి బైతి అనిల్‌ ఆనంద్‌, హరీ్‌షలు మోటార్‌ ఎందుకు ఆఫ్‌ చేశావంటూ గొడవకు దిగారు. ఈక్రమంలో నందకిశోర్‌పై దాడిచేయగా అతడి తలపై బలమైన గాయమైంది. దీంతో మనస్తాపానికి గురై నందకిశోర్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  దీంతో బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:47:05+05:30 IST