ఉద్యమకారుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-26T05:47:14+05:30 IST
గజ్వేల్,ఫిబ్రవరి 25: తెలంగాణ వచ్చినా తన బతుకు మారలేదని, ఉద్యోగం రాలేదని ఆవేదనతో గజ్వేల్ మండ లం అనంతరావుపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజు (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గజ్వేల్,ఫిబ్రవరి 25: తెలంగాణ వచ్చినా తన బతుకు మారలేదని, ఉద్యోగం రాలేదని ఆవేదనతో గజ్వేల్ మండ లం అనంతరావుపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజు (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో భాగంగా రాజు.. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు మారుతాయని ఆశించాడు. అయితే తాను అనుకున్న మార్పులేవీ జరగకపోవడంతో నిరాశకు గురై, మనస్తాపం చెందిన రాజు.. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.