చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-30T06:00:49+05:30 IST
మండలంలోని గొట్లూ రు గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కొండవారిపల్లి సురేష్(28) అప్పుల బాధ, కుటుంబ కలహాలతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు
ధర్మవరం రూరల్, జూన 29 : మండలంలోని గొట్లూ రు గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కొండవారిపల్లి సురేష్(28) అప్పుల బాధ, కుటుంబ కలహాలతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొండవారిపల్లి వీరనారప్ప, ఉమక్క దంపతుల ఒక్కగానొక కుమారుడు సురేష్.. తమ ఇంటిలోనే మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవాడు. మూడేళ్ల క్రితం తన మేనమామ కుమార్తె కృష్ణవేణితో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో సురేష్ సతమతమవుతుండేవాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. తరువాత వచ్చిన కుటుంబసభ్యులు.. సురే్షను కిందకుదించి చూడగా అప్పటికే మృతిచెందడంతో బోరున విలపించారు. పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.