భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-04-17T05:53:14+05:30 IST

భార్యకాపురానికి రాలేదని భర్త క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది.

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం

ధర్మవరంఅర్బన, ఏప్రిల్‌ 16: భార్యకాపురానికి రాలేదని భర్త క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సోమందేపల్లికి చెందిన జగన్నాథ్‌ శుక్రవారం పట్టణంలోని కొత్తపేటలో ఉన్న అత్తఇంటికి వచ్చి తన భార్యను కాపురానికి పంపాలని కోరాడు. కానీ భార్యకాపురానికి రానని, అవసరమైతే విడాకులు ఇస్తానంటూ తెగేసి చెప్పింది. దీంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురై కొత్తపేట ఆంజనేయస్వామి గుడి వద్ద క్రిమిసంహారక మందు తాగి అపరస్మారకస్థితిలో పడ్డాడు. దీంతో గమనించిన స్థా నికులు జగన్నాథ్‌ను స్థానిక ప్రభుత్వాసత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అర్బన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-04-17T05:53:14+05:30 IST