ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-24T05:38:19+05:30 IST
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్కు చెందిన వాల్వ్ విహన్సింగ్(28)
పేట్బషీరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్కు చెందిన వాల్వ్ విహన్సింగ్(28) బతుకుదెరువు కోసం వలసొచ్చి కొంపల్లి మున్సిపాల్టీలోని దూలపల్లిలో షెడ్స్ తయారు చేసే ఫ్యాబ్రికేషన్ షెడ్లో ఉంటూ అందులోనే పని చేస్తున్నాడు. శనివారం పనికి రాకపోవడంతో తోటి కార్మికులు షెడ్లోకి వెళ్లి చూడగా లుంగీతో ఉరేసుకొని మృతి చెందాడు. షెడ్ యజమాని కార్మికుల ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.