డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-13T05:23:43+05:30 IST

పట్టణంలోని ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

నరసరావుపేట లీగల్‌, ఏప్రిల్‌ 12: పట్టణంలోని ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మొదటి పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన దరివేముల ఆనందబాబు(22)  పట్టణంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలంగా ప్రకాష్‌నగర్‌లో ఓ మహిళతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. పరీక్షల కోసం అని ఈనెల 6న నరసరావుపేట వెళ్లాడని, తిరిగి తమ వద్దకు రాలేదని ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని తల్లి యలమందమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-04-13T05:23:43+05:30 IST